ఆ పని చేయనంటూ ఏడాదిగా తప్పించుకుంటున్న ఆద్య..వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!

by Disha Web Desk 8 |
ఆ పని చేయనంటూ ఏడాదిగా తప్పించుకుంటున్న ఆద్య..వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటించడంలో రేణు దేశాయ్ ముందు ఉంటుంది. అంతే కాకుండా ఈమె ఏ పోస్ట్ చేసినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ నటి టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె హీరోయిన్‌గా కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైన నటి, తర్వాత విడాకులు తీసుకొని పవన్ నుంచి విడిపోయి, ఒంటరిగా తన పిల్లలతో ఉంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.. రేణు దేశాయ్ కూతురు ఆద్య ఒక సంవత్సరం పాటు ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుందట. ఇక తాజాగా తాను ముక్కు కుట్టించుకుందంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఈ నటి.. ఈ మధ్య తమ అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. అంతే కాకుండా టైగర్ నాగేశ్వర్ రావు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రేణు, చాలా విషయాలు తన ఫ్యాన్స్‌తో పంచుకున్న విషయం తెలిసిందే. ఆమె రెండో పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా తనను రెండో పెళ్లి చేసుకొమ్మని తన పిల్లలు చెబుతున్నారని, అది వారికి, నాకు కూడా ఇష్టమే అంటూ పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది రేణు దేశాయ్.

Read More...

శ్రీదేవి చివరి చూపుకు కూడా రాని కసాయి చెల్లెలు.. అదే కారణమా?

Next Story

Most Viewed