సినిమాల్లో ఏడేళ్లు పూర్తి చేసుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రష్మిక

by Disha Web Desk 6 |
సినిమాల్లో ఏడేళ్లు పూర్తి చేసుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రష్మిక
X

దిశ, వెబ్‌‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ 2016లో డిసెంబర్ 30న ‘కిరిక్ పార్టీ’ పార్టీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, ఛలో చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఇండియావైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుని నేషనల్ క్రష్‌గా టాక్ ఆఫ్ ది టైన్‌గా నిలుస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌తో సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతుంది. అయితే రష్మిక ఇండస్ట్రీకి వచ్చి డిసెంబర్ 30 తో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో#NationalCrushmika అని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అవుతుంది. అయితే తనపై అభిమానులకు ఉన్న ప్రేమను చూసి రష్మిక ఫుల్ ఖుషీ అవుతుంది. ఇదిలా ఉంటే. నేషనల్ క్రష్ పుష్ప-2 రెయిన్‌బో, దిగర్ల్‌ఫ్రెండ్, చావా వంటి సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Next Story

Most Viewed