తల్లి అస్థికలు హరిద్వార్‌ గంగలో కలిపిన మహేష్..

by Disha Web Desk 6 |
తల్లి అస్థికలు హరిద్వార్‌ గంగలో కలిపిన మహేష్..
X

దిశ,సినిమా: టాలీవుడ్‌ సీనియర్‌ హీరో కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె అనారోగ్యంతో మరణించగా ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్‌ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఉన్న అనుబంధం గురించి పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా నిన్న తన ఇంటి వద్ద చిన్న కర్మ అయిపోగానే తల్లి ఇందిరా దేవి అస్థికలను గంగలో కలపడం కోసం హరిద్వార్‌ వెళ్లాడు. బేగంపేట నుంచి ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో హరిద్వార్‌ వెళ్లిన మహేష్ అస్థికలను గంగలో నిమజ్జనం చేశాడు. ఈ సందర్బంగా మహేష్‌ బాబు వెంట ఆయన బాబాయ్‌ ఆదిశేషగిరిరావు, జయదేవ్‌, సుధీర్‌ బాబుతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : నడవలేని పరిస్థితిలో ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్


Next Story

Most Viewed