ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్.. అప్పుడే సినిమా మొదలుపెడతానంటున్నాడు

by Disha Web Desk 6 |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్.. అప్పుడే సినిమా మొదలుపెడతానంటున్నాడు
X

దిశ, సినిమా: తమిళ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఇటీవలే డార్లింగ్‌తో సినిమా చేయబోతున్నట్లు లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ‘లియో’ ప్రచారంలో భాగంగా చెన్నైలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రభాస్ మూవీపై కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలిపాడు. ‘ఇటీవలే ప్రభాస్‌కు కథ వినిపించాను.

ప్రస్తుతం స్క్రిప్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌ ‘తలైవర్ 171’, కార్తితో ‘ఖైది 2’ సినిమాల తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ మొదులుపెడతా. త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇళయ దళపతి విజయ్‌ హీరోగా లోకేష్ తెరకెక్కించిన ‘లియో’ గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా.. విజయ్‌ మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, వీరిద్దరి ఖాతాలో మరో హిట్‌ పడ్డట్లేనంటున్నారు ఫ్యాన్స్.



Next Story