సినిమా హాల్లో మహిళకు పూనిన అమ్మవారు.. భయంతో జనాలు పరార్

by Disha Web Desk 16 |
సినిమా హాల్లో మహిళకు పూనిన అమ్మవారు.. భయంతో జనాలు పరార్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నాట ఇటీవల విడుదలైన సినిమా కాంతారా. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తూనే స్టోరీ రైటర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్‌గా సప్తమి గౌడ్ నటించారు. సెప్టెంబర్ 30న విడుదల కాగా, కన్నడలో బిగ్ హిట్‌ను సొంతం చేసుకుంది. కాంతారా మూవీ సారంశం ధర్మం కోసం జరిగే పోరాటం ఎలా జరిగింది అని. అయితే ఇందులో దైవభక్తితో అంశాలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సినిమా చూస్తోన్న ఓ మహిళకు హాల్లోనే అమ్మవారు పూనారు. దీంతో అక్కడున్న జనాలు భయపడిపోయారు. ఈ ఘటన బెంగళూరులో పీవీఆర్ మాల్‌లో జరిపినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed