గ్రాండ్ గా ఇండియన్ 2 ఆడియో లాంచ్.. తరలి వస్తున్న ఆ స్టార్ హీరోలు

by Kavitha |
గ్రాండ్ గా ఇండియన్ 2 ఆడియో లాంచ్.. తరలి వస్తున్న ఆ స్టార్ హీరోలు
X

దిశ, సినిమా: విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2”. ఈ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహా, ఎస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా నటుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమా కథ పెద్దది కావడంతో ఈ సినిమా మూడు పార్ట్‌లుగా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అలాగే ‘ఇండియన్ 2’ రిలీజ్ అయిన 6 నెలలకు ‘ఇండియన్ 3’ రిలీజ్ చేయనున్నట్లు కమల్ తెలిపారు. అలాగే ఇండియన్ 2 ఆడియో లాంచ్ జూన్ 1 న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ ను దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం సౌత్ లోని పలువురు స్టార్స్ ముఖ్య అతిధులుగా రానున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఈవెంట్ కి రాబోతున్నారంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఈవెంట్ కి వీరిద్దరితో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు కూడా రాబోతున్నారని సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే తమిళ్ స్టార్ హీరోలు శింబు, శివ కార్తికేయన్ ఈ ఈవెంట్‌కి రానున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది



Next Story

Most Viewed