నేషనల్ క్రష్ డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్... కానీ పరారీలో అసలు వ్యక్తి

by Disha Web Desk 7 |
నేషనల్ క్రష్ డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్... కానీ పరారీలో అసలు వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజుల నుంచి సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో నెట్టింట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఏఐ సాయంతో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత వరుసగా అలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు. ఈ విషయంపై చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ స్పందించారు. బాధితులకు సపోర్ట్‌గా నిలిచారు.

ఇక ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించింది. రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నులుగురే ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. అయితే.. వీళ్లే కాకుండా అసలు వ్యక్తి మరోకరు ఉన్నారట. అతను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed