- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీదేవి చివరి చూపుకు కూడా రాని కసాయి చెల్లెలు.. అదే కారణమా?
దిశ, సినిమా: అందాల ముద్దుగుమ్మ అతిలోక సుందరి దివంగత శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీదేవి అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పటి బాలీవుడ్ క్వీన్గా, టాలీవుడ్ అతిలోక సుందరిగా శ్రీదేవి.. ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి నటిగా మారి..టాప్ హీరోయిన్ అయ్యింది. ఎన్టీఆర్, ఎన్నాఆర్, కృష్ణ వంటి సీనియర్ నటులతో పాటు వీరి తర్వాతి తరమైన చిరంజీవి, నాగార్జున వంటి యంగ్ హీరోలతో ఆడిపాడిన ఏకైక నటి శ్రీదేవినే. సినీ ఇండస్ట్రీని ఏలిన ఈ అందాల రాణి ఇప్పుడు లేదు అనేది చాలా మందిని ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది.
1996లో తల్లి మరణంతో క్రుంగిపోయిన ఆ సమయంలో తనకు అండగా నిలిచిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే శ్రీదేవికి సోదరి శ్రీలత కూడా ఉన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. శ్రీదేవిని తీసిపోని అందం ఆమె సొంతం. శ్రీలతకు అక్క శ్రీదేవి కన్నా ముందే తమిళనాడుకు చెందిన సంజయ్ రామస్వామితో 1989లో వివాహం అయ్యింది.
శ్రీదేవి తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మరణించింది. దీనిపై శ్రీదేవి కేసు వేసి గెలిచింది. ఆమెకు పరిహారంగా రూ. 7.2 కోట్లు రాగా, అందులో తనకు వాటా కావాలని శ్రీలత కోర్టు మెట్లెక్కింది. అక్క పైనే కేసు వేసి.. రూ. 2 కోట్లు దక్కించుకుంది. ఇదే వీరిద్దరి మధ్య బంధాన్ని తెంపేసింది. చివరకు అక్క మరణించిన తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థన సమావేశానికి శ్రీలత వెళ్లలేదని తెలుస్తోంది.
Read More...
ఆ పని చేయనంటూ ఏడాదిగా తప్పించుకుంటున్న ఆద్య..వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!