- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏడాది పూర్తి చేసుకున్న ‘బలగం’ మూవీ.. వేణు ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న వారిలో వేణు ఒకరు. ఆయన కామెడీ పంచులతో, టైమింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం డైరెక్టర్గా కూడా రానిస్తున్నాడు. ఈ క్రమంలోనే వేణు ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తెలంగాణ కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దా భారీ హిట్ అందుకుని దాదారు రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది.
ఈ మూవీలో ఉన్న బంధాలు, భావోద్వేగాలు ప్రతి మనిషి అర్థం చేసుకోవాలని ఈ చిత్రాన్ని పళ్లేటూరులో తెరలు కట్టి మరీ ప్రదశ్శించారు. అంత సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ వేణు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘బలగం సినిమాను ఇంత ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో.. వేణుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.