- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జనాలను మళ్లీ మళ్లీ ఫూల్స్ను చేస్తున్న డైరెక్టర్..
దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించాడు. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీనీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న కేఆర్కే.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో వివేక్ జనాలను మోసం చేశాడంటూ నెట్టింట ట్వీట్ షేర్ చేశాడు. ఈ మేరకు ' వివేక్ అగ్నిహోత్రి భక్తులను మోసం చేసి ₹100 కోట్లు సంపాదించినందుకు తనను తాను మేధావిగా పరిగణించుకుంటున్నాడు. 'కశ్మీర్ ఫైల్స్' సినిమాకు వచ్చిన 50% ప్రాఫిట్ కశ్మీరీ పండిట్లకు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. భక్తులు కూడా అతన్ని అడగలేదు. అందుకే మరో కొత్త సినిమాతో వాళ్లను మళ్లీ ఫూల్స్ చేయవచ్చని భావిస్తున్నాడు' అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.