Allu Arjun కు అరుదైన గౌరవం.. టాలీవుడ్ నుంచి తొలి హీరోగా!

by Disha Web Desk 4 |
Allu Arjun కు అరుదైన గౌరవం.. టాలీవుడ్ నుంచి తొలి హీరోగా!
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. ఈ విషయాన్ని బన్నీ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పంచుకున్నారు. దుబాయ్ ఫోటోను షేర్ చేస్తూ 'థ్యాంక్యూ దుబాయ్ ఫర్ ద వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ వన్స్ ఎగేన్. థ్యాంక్యూ ఫర్ ద గోల్డెన్ వీసా.. సీ యూ సూన్ ఎగేన్' అంటూ కామెంట్‌ను ఫోటోకు జత చేశారు.

ఇప్పటివరకు ఈ వీసా అందుకున్న వారిలో కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, విక్రమ్, షారూఖ్ ఖాన్, సోనూసూద్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, అమలాపాల్, ఖుష్బు, త్రిష మరికొంత మంది ఉన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం ఈ వీసా అందుకున్నారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకు యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు జారీ చేస్తోంది. 2019 నుంచి ఈ వీసాలను యూఏఈ మంజూరు చూస్తుండగా.. ఈ వీసా ద్వారా దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించేందుకు వీలు ఉంటుంది.


Also Read...

Allu Arjun in Visakhapatnam : విశాఖలో పుష్పరాజ్ సందడి


Next Story

Most Viewed