ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ

by Disha Web Desk 4 |
ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని వంట మనిషికి అవమానం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఆమెకు పాస్ ​లేదని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆమె నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన వాహనం కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన యాదమ్మ హెచ్​ ఐసీసీ ప్రాంగణం బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానికి తెలంగాణ వంట రుచులు చూపించేందుకు కరీంనగర్​కు చెందిన యాదమ్మకు ప్రత్యేక ఆహ్వనం అందించారు. కానీ పాస్​ లేదన్న కారణంతో పోలీసులు ఆమెను బయటే అడ్డుకున్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed