- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ములుగు: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులే సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని. ఏఐసిసి మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సమావేశం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవి చందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీతక్క మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటమార్చిన కెసీఆర్కు ఇప్పుడు దళితులు గుర్తుకు వచ్చారా? అని ఎద్దేవా చేశారు.
ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తా అని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ఏడు సంవత్సరాలు గడిచినా.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు భూమి ఇస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రక్కకు లాక్కునే కుట్ర చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
- Tags
- congress