- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అశ్వాపురం: టీఆర్ఎస్ పార్టీ పదవుల్లో ఉండి పనిచేయని మండల నాయకులపై పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు వేటు తప్పదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇందులో భాగంగానే అశ్వాపురం మండల టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు వలబోజు మురళిని తొలగించానని, ఎటువంటి యువజన విభాగం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించని కారణంగా పదవి నుండి తొలగిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు.
అంతేగాక ఇంకా కొన్ని పదవుల్లో మార్పులు ఉంటాయని, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పదవులు పొంది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోని నాయకుల ఏరివేతకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
Next Story