పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by  |

దిశ, నల్లగొండ: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లను ఆయన పరిశీలించారు. మేళ్లవాయి గ్రామానికి చెందిన రైతు బొడ్డుపల్లి సుజాత, పసునూరుకు చెందిన రెడ్డిమూల కృష్ణయ్యకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు దెబ్బతిన్న వారికి రేకులు అందజేస్తానని ఎమ్మెల్యే భరోనా కల్పించారు.

tags: ts govt must help to farmers, munugode mla rajagopal reddy, nalgonda


Next Story