ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్.. రఘునందన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్.. రఘునందన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్​ తోనే సీఎం కేసీఆర్​ తిట్ల పురాణాన్ని తెరమీదకు తీసుకువచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు తేల్చిచెప్పారు. ఇటీవల కాలంలో కేసీఆర్​ తరచూ పీకేని కలుస్తున్నారని చెప్పారు. ఆయన సూచనలతోనే ఆందోళనలు, భౌతికదాడులు చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, మంత్రులు మతి లేకుండా కేంద్ర మంత్రులపై బూతులు తిట్టడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు చేసిన తప్పేంటో కేసీఆర్ ప్రజలకు విడమరచి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లను కేసీఆర్ దూషించిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నదన్నారు. మేధావులు కేసీఆర్ భాషపై చర్చించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. అవే తిట్లు మేం చేస్తే కేసీఆర్​ పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు. వడ్ల పైన శాస్త్రీయ డిబేట్ కి కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్​తో యాసంగి బియ్యం ఎట్లా కొనిపించాలో బీజేపీకి తెలుసని చెప్పారు.


Next Story

Most Viewed