- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. వెంగయ్యతో తనకు ఎలాంటి వివాదం లేదని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. శవ రాజకీయాలు చేయడమే జనసేన లక్ష్యమని విమర్శించారు. సింగరపల్లిలో తనను చందు అనే వ్యక్తి అడ్డుకున్నారని తెలిపారు. ఎడిటింగ్ చేసి సింగరపల్లిలో జరిగిన వివాదాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎంతమందితో యుద్ధం చేశారు.. ఎంతమందిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని అడిగారు.
వెంగయ్య మృతికి తానే కారణమని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని అన్నా రాంబాబు సవాల్ విసిరారు. తన నియోజవర్గంలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే విచారణ లేకుండా ఏ శిక్షనైనా అనుభవిస్తానని తెలిపారు. తాను గెలిస్తే జనసేన పార్టీని మూసివేయాలని తెలిపారు.
Next Story