- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ను రద్దు చేసినోళ్లు ఐటీ హబ్ చేస్తామంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ ది నిజాం సంస్కృతి అని అమిత్ షా అన్నారనీ…కానీ 1920లో గంగా జమునా తెహజీబ్ అని బాపూజీనే అన్నారని చెప్పారు. కేసీఆర్ ఒక్కడేననీ..సింహం సింగిల్గా వస్తుందని ఆయన అన్నారు. బీజేపీకి విషయం లేదు..నిండా విషమే అని చెప్పారు.
అన్ని మతాలు కలసి ఉంటే బీజేపీ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని తెలిపారు. పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్ను పెట్టొద్దని చెప్పారు. కూల గొడుతానన్న ఇద్దరు పిచ్చోళ్లను తరిమి కొట్టండని పిలుపు నిచ్చారు. ఆరేండ్లలో హైదరాబాద్కు కేంద్రం ఏం చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలని అన్నారు. కనీసం సికింద్రాబాద్ నియోజక వర్గానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. మోదీ కొత్త స్కీమ్ బేచో ఇండియా..మా పిలుపు సోచో ఇండియా అని అన్నారు. ఢిల్లీలో మత కల్లోలాలు అమిత్ షా వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల చర్యలతో ఢిల్లీ బ్రాండ్ ఇమేజి దెబ్బతిందని అన్నారు.