జిప్‌మర్‌ ఆదేశాలపై మంత్రి కేటీఆర్‌ అసహనం

by  |
Ask KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోని ప్రతి భారతీయుడు తమకు నచ్చిన భాషలో మాట్లాడే హక్కు ఉందని.. ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ జిప్‌మర్‌ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లిష్‌ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్‌ స్టాఫ్‌కు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప్‌మర్‌ వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోగా, తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

జిప్‌మర్‌ ఆదేశాలు భాష ఆధిపత్యాన్ని పునరావృతం చేస్తున్నాయన్నారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయని తెలిపారు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీతో సహా ఇతర భాషలు ఉన్నాయని, ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలి అన్నారు.



Next Story