కొద్ది రోజుల్లోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఖమ్మం : మంత్రి అజ‌య్‌

by  |
కొద్ది రోజుల్లోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఖమ్మం : మంత్రి అజ‌య్‌
X

దిశ‌, ఖ‌మ్మం: రాబోయే కొద్ది రోజుల్లోనే క‌రోనా ఫ్రీ జిల్లాగా ఖ‌మ్మం నిలుస్తుంద‌ని మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లా బజార్ కంటైన్మెంట్ జోన్‌లలో మంత్రి పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటికీ నిత్యావ‌స‌ర సరుకులను పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. స్థానిక ప్రజ‌లెవ‌రూ భ‌యాందోళ‌నకు గురి కావాల్సిన ప‌నిలేద‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ గురించి అందరూ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని ఇంటికి చేరుతుండ‌టం శుభ ప‌రిణామం అన్నారు. ఈ పర్యటనలో కలెక్ట‌ర్ క‌ర్ణ‌న్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు.

Tags: Minister Ajay, visited, containment zones, Khammam, Distribution, commodities



Next Story

Most Viewed