- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఖమ్మం నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లా బజార్ కంటైన్మెంట్ జోన్లలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన పనిలేదని తెలిపారు. కరోనా వైరస్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని ఇంటికి చేరుతుండటం శుభ పరిణామం అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు.
Tags: Minister Ajay, visited, containment zones, Khammam, Distribution, commodities
Next Story