- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: మతిస్థిమితం సరిగాలేని ఓ విహహిత తన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడ్రోజులుగా సహవాసం చేసింది.ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన లింబారెడ్డి( 64) భార్య శకుంతలతో కలిసి హౌజింగ్ బోర్డులో నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు సంతోష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటుండగా, కూతురు స్వప్న లండన్లో జాబ్ చేస్తున్నది. శకుంతల ఇరుగుపొరుగు వారితో కూడా సరిగా మాట్లాడదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందని స్థానికుల సమాచారం.ఈ నేపథ్యంలోనే కాలనీలో పాలు పోసే వ్యక్తిని శకుంతల పిలిచి తన భర్త చనిపోయి మూడ్రోజులు అయ్యిందని, మృతదేహన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో అతను షాక్కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఇంటి గేట్ తాళాలు పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా రక్తం గట్టిన స్థితిలో లింబారెడ్డి మృత దేహాన్ని గుర్తించారు.అతను చనిపోయి మూడ్రోజులు కావడంతో శవం కుళ్లిన స్టేజీలో ఉందని, దుర్వాసన వెదజల్లుతోందని పోలీసులు వెల్లడించారు. మృతదేహన్ని వెంటనే పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని శకుంతలే తన భర్తను హత్య చేసి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. అనంతరం తండ్రి చనిపోయిన విషయాన్ని కొడుకు, కూతురుకు స్థానికులు అందించారు.