నేటి నుంచి ఎండీఎస్​ కన్వీనర్​ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ

by  |
నేటి నుంచి ఎండీఎస్​ కన్వీనర్​ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ రోజు నుంచి పీజీ దంత వైద్య కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 21వ తేదీ వరకు ఆన్​లైన్​ లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్, ఎండీఎస్​ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలంది నిర్ధేశిత దరఖాస్తును పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలంది.

ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువ పత్రాలను పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ తుది మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed