- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: మాజీ మిస్ వరల్డ్, హీరోయిన్ మానుషి చిల్లర్.. ‘ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే’ సందర్భంగా తన ట్విట్టర్ హ్యాండిల్లో స్పెషల్ పోస్ట్ పెట్టింది. మానవ జాతికి మహిళే వెన్నుముక అనే లోతైన అర్థాన్నిచ్చేలా చేసిన స్వయంగా గీసిన పెయింటింగ్ను షేర్ చేసింది. అయితే 2017 ఏప్రిల్లో మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘శక్తి ప్రాజెక్టు’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్న మల్టీటాలెంటెడ్ బ్యూటీ.. ‘ ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డేను అందరం కలిసి ఘనంగా జరుపుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తూ, మహిళ మనుగడకు భరోసానిచ్చే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేద్దాం. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది మహిళ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేను ఒక అమ్మాయిగా మన ప్రేమకు చిహ్నంగా, మనమందరం ఒక్కటిగా కలిసున్నామని చాటి చెప్పడానికే ఈ కళాకృతిని తీర్చిదిద్దాను’ అంటూ స్ర్తీ ప్రాముఖ్యతను తెలియజేసింది. కాగా మానుషి.. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.