- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: పట్టపగలు మిట్టమధ్యాహ్నం వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ సమీపంలో గొందిగాళ్ల గాలయ్యను(53) గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడ్చి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలయ్య బైక్పై శుక్రవారం మధ్యాహ్నం చౌటుప్పల్ వెళ్తున్న క్రమంలో బైక్ హైస్కూల్ దాటగానే అడ్డగించిన దుండగులు గాలయ్యపై కత్తులతో దాడిచేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన గాలయ్యను స్థానికులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాలయ్య హత్యకు కుమారుడి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు గాలయ్య బొంబాయిలో జీవనం సాగిస్తుండగా.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల సొంత గ్రామం జనగాంకు వచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story