దారికాచి.. కత్తులతో దాడి చేసి!

by  |
దారికాచి.. కత్తులతో దాడి చేసి!
X

దిశ, నల్లగొండ: పట్టపగలు మిట్టమధ్యాహ్నం వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ సమీపంలో గొందిగాళ్ల గాలయ్యను(53) గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడ్చి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలయ్య బైక్‌పై శుక్రవారం మధ్యాహ్నం చౌటుప్పల్ వెళ్తున్న క్రమంలో బైక్ హైస్కూల్ దాటగానే అడ్డగించిన దుండగులు గాలయ్యపై కత్తులతో దాడిచేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన గాలయ్యను స్థానికులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాలయ్య హత్యకు కుమారుడి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు గాలయ్య బొంబాయిలో జీవనం సాగిస్తుండగా.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల సొంత గ్రామం జనగాంకు వచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed