పిడుగుపాటుకు వ్యక్తి మృతి

by  |
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
X

దిశ నిర్మల్:
పిడుగుపాటుతో నిర్మల్ జిల్లాలో ఓ పశువుల కాపరి మృతి చెందాడు. ఎస్సై రామ్ నరసింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని జాం గ్రామనికి చెందిన కామిండ్లభోజన్న (43) అనే పశువుల కాపరి రోజూ లాగానే శనివారం కూడా పశువులను మేపేందుకు వెళ్లాడు. గ్రామ శివారులో పశువులను మేపుతుండగా వర్షం పడింది. చెట్టు కింద నిల్చోగా అతనిపై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story