- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విష జ్వరాల ఎఫెక్ట్.. ఫీవర్తో గిరిజన వ్యక్తి మృతి

X
దిశ, ములకలపల్లి : జ్వరంతో గిరిజనుడు మృతి చెందిన సంఘటన ములకలపల్లి మండలంలో చోటు చేసుకుంది. మూకమామిడి పంచాయితీ సాయిరాంపురం గ్రామానికి చెందిన కాకా వెంకటేశ్వర్లు (48) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వెంకటేశ్వర్లు గత 20 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు.
కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ మహాత్మాగాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమ్మ ఒక కూతురు ఉన్నారు.
- Tags
- khammam
Next Story