ఘోర ప్రమాదం.. మామిడాల శంకర్ మృతి

by  |
ఘోర ప్రమాదం.. మామిడాల శంకర్ మృతి
X

దిశ, హుస్నాబాద్ : లారీ బైక్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు మామిడాల శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన మామిడాల శంకర్, తన సోదరుడు మామిడాల శ్రీనివాస్.. అంతకపేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి బైకుపై తిరుగు ప్రయాణమయ్యారు.

ఇంతలో జనగామ జిల్లా నుంచి వస్తున్న ఎంహెచ్34ఏవీ 1629 నెంబర్ లారీ..బైకును ఢీకొట్టడంతో శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుడి సోదరుడు శ్రీనివాస్‌కు గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed