మహాధర్నా ఫలితమే వ్యవసాయ చట్టాల రద్దు: రాజారాం

by  |
trs-comments1
X

దిశ, బజార్ హత్నూర్: రైతు పోరాటాలకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నా ఫలితమే కేంద్రం చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు కారణమని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కానిందే రాజారాం అన్నారు. మండల కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతుల విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుంజల భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, టీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్, మండల తుడుం దెబ్బ అధ్యక్షుడు పర్చ సాయన్న, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి


Next Story

Most Viewed