బామ్మ ఐడియా ఫాలో అయ్యాను: మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా

by  |
బామ్మ ఐడియా ఫాలో అయ్యాను: మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా
X

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆ రాష్ట్ర కీలక నేతలను నిర్భందంలో ఉంచారు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని కూడా గృహ నిర్భందంలో ఉంచారు. ఈ నేపథ్యంలో మెహబూబా కూతురు ఇల్తిజా తన తల్లితో మాట్లాడానికి కుదరలేదు. దీంతో చెప్పదల్చుకున్న విషయాన్ని కాగితంపై రాసి చపాతిలో పెట్టి పంపానని ఇల్తిజా ట్వీట్టర్ ద్వారా తెలిపింది.

‘మా అమ్మను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం. ఒక రోజు మా అమ్మకు పంపించిన టిఫిన్ బాక్సులో నాకు ఉత్తరం రాసి అందులో పెట్టి పంపించింది. అందులో ‘ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ’ అని రాసి ఉంది. దానికి రిప్లై ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు. మా బామ్మ ఓ ఐడియా ఇచ్చింది. ఓ కాగితంపై రాసి దాన్ని చపాతిలో పెట్టి పంపాను. అంటూ ఇల్తిజా ట్విట్ చేసింది.


Next Story

Most Viewed