Web 3.0 తో వినియోగదారుల డేటా చోరీని అరికట్టడమే లక్ష్యం..

by Disha Web Desk 6 |
Web 3.0 తో వినియోగదారుల డేటా చోరీని అరికట్టడమే లక్ష్యం..
X

దిశ, ఫీచర్స్ : 'వరల్డ్ వైడ్ వెబ్(www)' సృష్టికర్త ఇప్పుడు దానిని రక్షించే పనిలో ఉన్నాడు. మొదటిసారిగా 1989లో వెబ్ అనే భావనతో ముందుకు వచ్చిన సర్ తిమోతీ బెర్నర్స్-లీ.. 33 ఏళ్ల తర్వాత దీనిపై ఆందోళన వ్యక్తపరిచాడు. టెక్ ప్లాట్‌ఫామ్స్ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయని, జనాలను సమస్యల్లోకి నెట్టేస్తున్నాయని హెచ్చరించాడు. దీన్ని సరిదిద్దుకునేందుకు Web3.0 అవసరమని పిలుపునిస్తున్నాడు.

వరల్డ్ వైడ్ వెబ్ ఎలా ప్రారంభమైంది?

1955లో లండన్‌లో జన్మించిన బెర్నర్స్-లీ.. ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. 1980లలో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN)లో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆయన.. సిస్టమ్స్‌లో డేటా షేరింగ్‌కు శాస్త్రవేత్తలను అనుమతించడమే లక్ష్యంగా అసలైన వెబ్‌ నమూనాతో ముందుకొచ్చాడు. దీన్ని 'ఎంక్వైర్ విత్‌ఇన్ అపాన్ ఎవ్రీథింగ్' పేరుతో పిలుచుకున్నాడు. అయితే, 1970ల్లో ఉనికిలో ఉన్న ఇంటర్నెట్ వెబ్ లాంటిది కాదు. అసలు ఇంటర్నెట్ ఉందని కూడా ఎవరికీ తెలియదు. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు బాబ్ కాన్, వింట్ సెర్ఫ్ మొదట ఇంటర్నెట్ ప్రోటోకాల్(IP)ను అభివృద్ధి చేశారు. ఇది కంప్యూటర్ల ద్వారా సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించింది. క్లుప్తంగా ఇది కంప్యూటర్లు ఒకదానితో ఒకటి మాట్లాడగలిగే ప్రక్రియను సృష్టించింది. ఇది వెబ్ ప్లగ్ ఇన్ చేయగల ఫిజికల్ పార్ట్.

అయితే బెర్నర్స్-లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో శాస్త్రవేత్తల మధ్య స్వయంచాలక సమాచార-భాగస్వామ్య డిమాండ్‌ను తీర్చడానికి ఒకే సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన చేశాడు. 1990లో అతను వెబ్ కోసం రెండో ప్రతిపాదనను రాశాడు. ఇది బ్రౌజర్స్ 'హైపర్‌టెక్స్ట్ డాక్యుమెంట్స్'ను వీక్షించడానికి అనుమతించే 'వరల్డ్‌వైడ్‌వెబ్' అనే 'హైపర్‌టెక్స్ట్ ప్రాజెక్ట్' నిబంధనలను వివరించింది. సంవత్సరం చివరి నాటికి ఈ ఆలోచనను అమలులో పెట్టిన బెర్నర్స్-లీ.. కంప్యూటర్‌లో తన వెబ్ సర్వర్ కోసం కోడ్‌ను అభివృద్ధి చేశాడు. కానీ ఇది అనుకోకుండా స్విచ్ ఆఫ్ కాకుండా నిరోధించడానికి.. 'ఈ మెషిన్ సర్వర్. దీన్ని పవర్ డౌన్ చేయవద్దు!!' అని ఎరుపు సిరాతో చేతితో రాసిన ట్యాగ్ కంప్యూటర్‌పై ఉండేది.

ఇంటర్నెట్ ఎలా ప్రారంభించబడింది?

1993లో CERN వరల్డ్ వైడ్ వెబ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. 'మేము ఇంటర్నెట్ మొదటి దశ, Web1.0 ఆవిర్భావాన్ని చూశాం. ఇది అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ.. రీడ్-ఓన్లీ వెబ్ టైప్. కోడింగ్ ఇన్స్ అండ్ అవుట్స్ తెలిసిన కొద్దిమంది మాత్రమే ఏదైనా ప్రచురించగలరు' అని తెలిపింది. ఇది కాస్తా Web2.0 అభివృద్ధికి దారితీసింది. మనం వెబ్‌తో మరింత ఇంటరాక్ట్ అవ్వడానికి, సృష్టికర్తలుగా మారడానికి అనుమతిస్తుంది. తద్వారా గూగుల్, ఫేస్ బుక్ తదితర పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో మనకు నచ్చిన వాటిని ప్రచురించే అవకాశాన్ని కల్పించింది. కానీ అది ఉచితంగా రాదు. ప్రతిఫలంగా చాలా కంపెనీలు మన డేటాను తీసుకుంటున్నాయి. టార్గెట్ యాడ్స్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఈ డేటాను సదరు కంపెనీలకు అందించేది ఈ బిగ్గెస్ట్ ప్లాట్‌ఫామ్సే.

సురక్షిత పరిష్కారం

ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్న బెర్నర్స్-లీకి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లోని తన ల్యాబ్‌లో పని చేస్తున్నప్పుడు కొత్త వెబ్ ఆలోచన పుట్టింది. Web2.0 డిస్‌ఫంక్షన్‌కు అతని సొల్యూషన్.. ప్రోటోకాల్స్ థర్డ్ లేయర్. ఇది ఒక వ్యక్తికి వారి సొంత వ్యక్తిగత IDతో ఏదైనా లాగిన్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. మొత్తానికి లీ 'సాలిడ్' అనే కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చాడు. 'సాలిడ్' లాంచ్‌కు సహాయం చేయడానికి 'ఇన్‌రప్ట్' అనే కొత్త కంపెనీని రూపొందించాడు. బెర్నర్స్-లీ ప్లాట్‌ఫామ్‌ను మీ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. కానీ అది యాప్ కాదు. అతను దానిని 'పాడ్' అని పిలుస్తాడు. ఇక్కడ మీరు మీ ప్రైవేట్ డేటాను నిల్వ చేయొచ్చు, చాలా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీన్ని మీ 'కీ' లేదా సురక్షితంగా ఉంచబడిన డిజిటల్ IDగా భావించవచ్చు.

Web3.0 కోసం ఇది తన వ్యూ అని చెప్పిన లీ.. ఇది ఎథీరియం బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌ను ఉపయోగించే Web3 కాదని, వికేంద్రీకరణకు హామీ ఇస్తున్నానని నొక్కి చెప్పాడు. Web3తో హెల్త్ రికార్డ్స్ వంటి డేటాను సులభంగా గుర్తించవచ్చు. ఇది పబ్లిక్ అయినందున, దానిని సురక్షితంగా ఉంచడం ఖరీదైనది. వేగం మరొక సమస్య. కాగా ఇది పూర్తిగా వికేంద్రీకరణ చేయగలదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అనేక క్రిప్టోకరెన్సీ, మెటావర్స్ కంపెనీలు Web3 అనే పదాన్ని ఇంటర్నెట్ భవిష్యత్తుగా మారుస్తాయి. కానీ 'ఇన్‌రప్ట్' ఇందుకు ఒప్పుకోదన్నాడు.

ఇంకా అందుబాటులో ఉందా?

అయితే ఇది ఇప్పటికే బెల్జియంలోని ఫ్లెమిష్ మాట్లాడే ఉత్తర ప్రాంతమైన ఫ్లాండర్స్‌లో విడుదల చేయబడుతోంది. 'పాడ్స్' ద్వారా సామాజిక సేవలు అందించబడతాయని బెర్నర్స్-లీ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి 6.5 మిలియన్ పౌరులు ఈ సాంకేతికతను ఉపయోగించుకోగలరు. ఇతర వినియోగదారులు బీమా పరిశ్రమతో పాటు అనేక ఇతర రకాల వ్యాపారాలను కలిగి ఉన్నారు. కానీ సాంకేతికత ప్రతి ఒక్కరికీ, ప్రతి దేశానికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు లీ.

శరణార్థులు తమ 'పాడ్‌'ను పంచుకోవడానికి అనుమతించడం ద్వారా వారికి సాయం చేయడానికి ఇన్‌రప్ట్ NGOలతో కలిసి పని చేసింది. వారు తమ వైద్య డేటాను, వారికి అందించిన బట్టలు, గుడారాలను పంచుకుంటూ.. NGOలో నమోదు చేసుకోవచ్చు. గృహ హింస బాధితుల కోసం ఇతర దేశాలు తన సహాయాన్ని కోరాయని.. బాధితులకు ఇన్‌రప్ట్ 'పాడ్‌'లను అందించిందని బెర్నర్స్-లీ చెప్పారు. ఒక వ్యక్తికి పాడ్ ఇచ్చినట్లయితే.. అతనికి సంబంధించిన ఆన్‌లైన్ డేటా సురక్షితంగా ఉన్నట్లే.

బిగ్ టెక్‌లో కూడా గెలుస్తాం

'బిగ్ ప్లాట్‌ఫామ్స్ లాభాన్ని పొందేందుకు కంపెనీలు, ప్రకటనదారులకు విక్రయించే వినియోగదారుల డేటాకు యాక్సెస్‌ను కోల్పోతున్నప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాయి?' అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు లీ. ఇందులో ప్రతి ఒక్కరూ గెలుస్తారని.. ఎందుకంటే డేటా నియంత్రణ పౌరుల చేతుల్లో ఉందని, కంపెనీలకు వినియోగదారు ప్రాధాన్యతలపై మంచి అవగాహన ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాడ్‌లు ఉపయోగించడం మూలంగా.. ప్రభుత్వాలు, వ్యాపారాలతో మాట్లాడటం కొనసాగించడమే ఇప్పుడు ఇన్‌రప్ట్ పని అని వివరించారు. అయితే ఇది ప్రతిచోటా ఉపయోగించబడినప్పటికీ, వెబ్‌ను సురక్షితమైన స్థలంగా మార్చడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది.

రూపాయి ఎలా పుట్టింది...?


Next Story

Most Viewed