దహన సంస్కారాల్లో తెల్లటి వస్త్రాలనే ఎందుకు వాడుతారో తెలుసా?

by samatah |   (  Updated:2023-05-30 09:23:07  IST  )

పుట్టుక చావులనేవి చాలా కామన్. పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే మరణించక తప్పదు. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు జరపడానికి ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తుంటాం. అందులో తెల్ల బట్టలు ఒకటి.

దహన సంస్కారాల్లో తెల్లటి వస్త్రాలనే ఎందుకు వాడుతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పుట్టుక చావులనేవి చాలా కామన్. పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే మరణించక తప్పదు. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు జరపడానికి ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తుంటాం. అందులో తెల్ల బట్టలు ఒకటి. ఎవరైనా చనిపోతే తెల్లటి వస్త్రాలు ధరించి, దహన కార్యక్రమాలకు హాజరవుతుంటారు.

అయితే దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నదంట. నిజానికి, తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శాంతిని, పరిశుభ్రతను సూచిస్తుంది. ఈ రంగు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది, సానుకూల శక్తి ప్రకాశాన్ని బలపరుస్తుంది. ఒకరి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు శ్మశానవాటికకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ప్రతికూల శక్తులు వారికి దూరంగా ఉండేందుకు తెల్లని దుస్తులు ధరిస్తారు.

Also Read...

అంత్యక్రియల్లో వెనక్కు తిరిగి ఎందుకు చూడకూడదో తెలుసా?

Next Story