- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణకు మొండిచెయ్యి చూపించారు. ఉద్యమకారులు, సీనియర్ రాజకీయ నేతలు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోలేదు. ఒక్కరికి మాత్రమే ప్రాధాన్యత కల్పించడంతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డికి మాత్రమే అవకాశం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న మిగతా నేతలకు నిరాశే మిగిలింది. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
సోమవారం రాత్రి వరకు ఛాన్స్ ఇస్తారని ఎదురుచూసిన కోటిరెడ్డికి నిరాశే ఎదురైంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇవ్వలేదు. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. ఏకంగా ఐదుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. అందులో కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, బండా ప్రకాశ్కు అవకాశం కల్పించారు. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. దక్షిణ తెలంగాణకు చెందిన నేతలు కేసీఆర్ తమపై చిన్నచూపు చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు ఇప్పుడు టీఆర్ఎస్లో దుమారం రేపుతోంది.