గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత

by Disha Web Desk 1 |
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరిన కాసేపట్లో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో లోకో పైలట్ రైలును మౌలాలి స్టేషన్‌లో నిలిపివేశారు. అయితే మరమ్మత్తుల అనంతరం గోదావరి ఎక్స్‌ప్రెస్ తిరిగి బయలుదేరింది. అయితే, ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed