బీజేపీ నేతలకు ఇదే చివరి వార్నింగ్ : కేటీఆర్

by  |
ktr double decker bus memories
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, బీజేపీ నేతలకు ఇదే నా చివరి వార్నింగ్ అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా లను కూడా ఉతికి ఆరేస్తామన్నారు. గ్రేటర్ వరంగల్ లో సుడిగాలి పర్యటన చేసిన కేటీఆర్ బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆరోగ్యకర పోటీకి రావాలని సవాల్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ. 2 వేల కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నేతలు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పిల్లలను రెచ్చగొట్టి దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. వరంగల్ కు మేం ఏం చేశామో శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ అన్నారు.


Next Story

Most Viewed