- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : పుట్టిన గంటల వ్యవధిలోనే శ్వాస తీసుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకున్న చిన్నారిని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. తల్లి గర్భంలో ఉన్న పిల్లలు సాధారణంగా మల విసర్జన చేయరు. కానీ అత్యంత అరుదుగా కొన్నిసార్లు చేస్తారని, తర్వాత మళ్లీ అది ఉమ్మనీరులో కలిసి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్తుందని, దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవడం వలన, చాలా అత్యాధునికమైన, సంక్లిష్టమైన వైద్యచికిత్సలు చేయాల్సి వస్తుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ , పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ వి. నందకిషోర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నా, కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టంగా మారిందని , దీంతో పాపను వెంటనే ఐసీయూకు తరలించి, వెంటిలేటర్ అమర్చడం ద్వారా గాలి అందించామన్నారు .తల్లి గర్భంలో ఉండగా మలవిసర్జన చేయడంతో పాటు ఊపిరితిత్తుల్లో పాపకు రక్తపోటు బాగా ఎక్కువైంది (పల్మనరీ హైపర్టెన్షన్). దీంతో ప్రత్యేకమైన ఔషధం, గ్యాస్ (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్) కూడా అందించి ఊపిరితిత్తుల్లో రక్తపోటు తగ్గించాల్సి వచ్చిందని, ఇంత చికిత్స చేసినా పాప పరిస్థితి మరింత విషమంగా మారుతూ రావడంతో పాపను కిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ ఎక్మో ఆధారంగా చికిత్స అందించమన్నారు.పాపను వెంటనే ఎక్మో మీద పెట్టి, సాధారణ స్థితికి తెచ్చామని , పిల్లల గుండె వైద్య నిపుణులు చిన్న ఆపరేషన్ చేసి ఈ చికిత్స చేశారని ఆయన వెల్లడించారు . పాపకు 5 రోజుల పాటు ఎక్మో సపోర్ట్ అవసరమైందని , తర్వాత మరో 5 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచడం జరిగిందన్నారు . ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో పాపను డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపామన్నారు. ఇప్పుడు ఆ చిన్నారి తల్లిపాలు కూడా తాగుతోందని డాక్టర్ నందకిషోర్ వివరించారు .
ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని ఎక్మో చేస్తుందని, తద్వారా ఊపిరితిత్తులు కోలుకోడానికి సమయం, విశ్రాంతి దొరుకుతాయని చెప్పారు . ఎక్మో సర్క్యూట్లో ఉండే కృత్రిమ ఊపిరితిత్తులకు (ఆక్సిజనేటర్) రక్తప్రసారాన్ని మళ్లించడంతో సాధారణంగా గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా దెబ్బతిని, సంప్రదాయ చికిత్సా పద్ధతులతో నయం కాని పరిస్థితుల్లో ఎక్మోను ఉపయోగించడం జరుగుతుందన్నారు . ఇది అన్ని వయసుల
వారికీ చేస్తారుని, ముఖ్యంగా హెచ్1ఎన్1, కొవిడ్-19 కాలంలో ఇది అందరికీ తెలిసిందన్నారు . పాశ్చాత్య దేశాల్లో దాదాపు 40 ఏళ్లుగా ఎక్మో అందుబాటులో ఉందని , మన దేశంలో పదేళ్ల క్రితం వచ్చిందన్నారు.