- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాటకీయ పరిణామల మధ్య ఖమ్మం రూరల్ ఎంపీవో బదిలీ

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ ఎంపీవో బదిలీ నాటకీయ పరిణామల మధ్య జరిగింది. ఈ నెల 23న జిల్లాలోని పలువురు ఎంపీవోలను జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. కూసుమంచి మండల ఎంపీవోగా పనిచేస్తున్న గాంధీని రూరల్కు, రూరల్ మండల ఎంపీవోగా పనిచేస్తున్న టీవీఎల్ఎన్ శాస్త్రిని సింగరేణి మండలానికి బదిలీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రూరల్ మండల ఎంపీవోగా గాంధీ జాయిన్ అయ్యారు. పట్టుమని వారం రోజులు కూడా పనిచేయకుండానే గాంధీ స్థానంలో మరొకరు వచ్చారు. రాజకీయ పరిణామాల మద్య బుధవారం గాంధీ స్థానంలో కొత్తగూడెం జిల్లా బుర్గంపహడ్ మండల ఎంపీవోగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావునునియమించి, గాంధీని కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తూ పీఆర్ కమిషనర్ ఉత్వర్వులను జారీ చేశారు. రూరల్ ఎంపీవో కనీసం పది రోజులైన పనిచేయకుండా బదిలీ అవడం పట్ల రాజకీయ ఒత్తిళ్లే కారణం అని పలువురు అనుకుంటున్నారు.