నాటకీయ పరిణామల మధ్య ఖమ్మం రూరల్​ ఎంపీవో బదిలీ

by Sridhar Babu |   ( Updated:2021-06-30 06:25:33.0  )
khammam mpo news
X

దిశ, ఖమ్మం రూరల్​ : ఖమ్మం రూరల్​ ఎంపీవో బదిలీ నాటకీయ పరిణామల మధ్య జరిగింది. ఈ నెల 23న జిల్లాలోని పలువురు ఎంపీవోలను జిల్లా కలెక్టర్​ బదిలీ చేశారు. కూసుమంచి మండల ఎంపీవోగా పనిచేస్తున్న గాంధీని రూరల్​కు, రూరల్​ మండల ఎంపీవోగా పనిచేస్తున్న టీవీఎల్​ఎన్​ శాస్త్రిని సింగరేణి మండలానికి బదిలీ చేశారు. కలెక్టర్​ ఆదేశాలతో రూరల్​ మండల ఎంపీవోగా గాంధీ జాయిన్​ అయ్యారు. పట్టుమని వారం రోజులు కూడా పనిచేయకుండానే గాంధీ స్థానంలో మరొకరు వచ్చారు. రాజకీయ పరిణామాల మద్య బుధవారం గాంధీ స్థానంలో కొత్తగూడెం జిల్లా బుర్గంపహడ్​ మండల ఎంపీవోగా పనిచేస్తున్న సీహెచ్​ శ్రీనివాసరావునునియమించి, గాంధీని కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తూ పీఆర్​ కమిషనర్​ ఉత్వర్వులను జారీ చేశారు. రూరల్​ ఎంపీవో కనీసం పది రోజులైన పనిచేయకుండా బదిలీ అవడం పట్ల రాజకీయ ఒత్తిళ్లే కారణం అని పలువురు అనుకుంటున్నారు.



Next Story

Most Viewed