- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా దగ్గు శ్రీను..

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. మాజీ అధ్యక్షుడు సత్యంబాబుపై దగ్గు శ్రీను భారీ మెజార్టీ తో గెలుపొందారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లారీ యజమానుల సంఘం కార్యదర్శి బోయపాటి వాసు తన అభ్యర్థి దగ్గు శ్రీను ని గెలిపించుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. లారీ యజమానుల సంక్షేమం కోసం ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడి నియామకం కోసం ప్రత్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ అధ్యక్షుడు సత్యంబాబు గతంలో రెండుసార్లు పోటీ చేసి మెజార్టీ చేజిక్కించుకున్న ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకున్నారు.
మొత్తం 384 ఓట్లు పోల్ అవ్వగా సత్యంబాబుకి 114 ఓట్లు, దగ్గు శ్రీనుకి 270 ఓట్లు రావడం జరిగింది. ఈ ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా ప్రముఖ న్యాయవాది కొత్త వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి బోయపాటివాసు మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన దగ్గు శ్రీనికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యవర్గం మొత్తం నూతన అధ్యక్షుడుకి పూర్తిస్థాయిలో సహకారాన్నిఅందిస్తుందని, రానున్న రోజుల్లో యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తమన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం అన్నారు.