- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో 25శాతం బస్సు చార్జీల పెరుగుదల
<p>దిశ, వెబ్డెస్క్: కేరళ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్సుపోర్టు చార్జీలను 25శాతం పెంచేందుకు నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో వచ్చిన ఆర్థిక కష్టాల నుంచి కేరళ ప్రజా రవాణా వ్యవస్థను గట్టేక్కించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సు ప్రయాణా చార్జీలు 25శాతం మేర పెరుగనున్నాయి.అయితే, గతంలో లానే టిక్కెట్టు కనీస ధర రూ. 8గానే ఉంటుందని కేరళ రవాణా శాఖ మంత్రి ఏకే శ్రీథరన్ తెలిపారు. గతంలో ఈ ధరకు కనీస దూరం […]</p>

దిశ, వెబ్డెస్క్: కేరళ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్సుపోర్టు చార్జీలను 25శాతం పెంచేందుకు నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో వచ్చిన ఆర్థిక కష్టాల నుంచి కేరళ ప్రజా రవాణా వ్యవస్థను గట్టేక్కించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సు ప్రయాణా చార్జీలు 25శాతం మేర పెరుగనున్నాయి.అయితే, గతంలో లానే టిక్కెట్టు కనీస ధర రూ. 8గానే ఉంటుందని కేరళ రవాణా శాఖ మంత్రి ఏకే శ్రీథరన్ తెలిపారు. గతంలో ఈ ధరకు కనీస దూరం 5 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం దాన్ని 2.5 కిలోమీట్లరకే పరిమితం చేశారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల నియమించిన జుడీషియల్ కమిటీ చేసిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఇచ్చే రాయతీలను పరిశీలించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అయితే దానికి ఆమోదం లభించలేదు. ప్రస్తుతం విద్యాసంస్థలు మూసి ఉన్నందున విద్యార్థులకు ఇచ్చే ప్రత్యేక రాయితీలు లేకుండా చార్జీలు కొనసాగించాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.






