- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో కవితకు ఓటు హక్కు ఉందని, ఇప్పుడు బంజారాహిల్స్ లో ఓటు వేయడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ… పోతంగల్లో ఉన్న ఓటు అలాగే ఉండగా ఇక్కడ ఎలా రెండో ఓటు వేశారని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమార్తే ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ… దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు ఇందిరా శోభన్.
Next Story