42.2 కిమీ లాంగ్ మారథాన్ ఫినిష్ చేసిన SP శ్వేతారెడ్డి

by  |
42.2 కిమీ లాంగ్ మారథాన్ ఫినిష్ చేసిన SP శ్వేతారెడ్డి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి హైదరాబాద్‌లో జరిగిన లాంగ్ మారథాన్‌లో పాల్గొని 42.2 కిలోమీటర్ల పరుగును దిగ్విజయంగా పూర్తి చేశారు. హైదరాబాద్ వేదికగా ఎయిర్ టెల్ వారి సౌజన్యంతో నిర్వహించిన లాంగ్ మారథాన్‌లో ఎస్పీ శ్వేతారెడ్డి పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42.2 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశారు. మార్తాండ్ రన్నర్ బి. నిరంజన్ ఎస్పీ శ్వేతారెడ్డికి కోచ్‌గా వ్యవహరించి తగు సలహాలు, సూచనలు అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరిలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ముఖ్యంగా తమ శాఖలో విధులు నిర్వహిస్తున్న అందరికీ ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో నడక, పరుగు లాంటి వ్యాయామాలు చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed