కేటీఆర్‌ను కలిసిన జేవీఎస్.. కారణం అదేనా ?

by  |
కేటీఆర్‌ను కలిసిన జేవీఎస్.. కారణం అదేనా ?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కొత్తగూడెంకు చెందిన ప్రముఖ విద్యావేత్త, జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు జే.వీ.ఎస్‌.చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా జేవీఎస్‌తో ఆత్మీయంగా కేటీఆర్‌ ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌తో కలిసి పనిచేసిన సందర్భంగా జేవీఎస్‌తో కేటీఆర్‌కు ప్రత్యేకమైన అనుబధం ఉంది. ఈ నేపథ్యంలోనే జేవీఎస్‌తో కేటీఆర్‌ ఆత్మీయంగా కలిశారు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయాలపై చర్చ సాగింది. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, పార్టీ అభివృద్ధి అహర్నిషలు కష్టించి పనిచేస్తున్న కార్యకర్తలకు రానున్న కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని జేవీఎస్‌ కేటీఆర్‌ను కోరారు. ఇందుకు స్పందించిన కేటీఆర్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా సముచిత స్థానం కల్పిస్తామని, వారికి మంచి భవిష్యత్‌ అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు, టీఆర్‌ఎస్‌కు ఆది నుంచి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇవ్వడం పట్ల జేవీఎస్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed