నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

by srinivas |
నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జనవరి 19 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.



Next Story