రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

by  |
రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో అలజడి చెలరేగేలా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, టీకా పరిస్థితి ఏంటో ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. రుయా ఆస్పత్రి ఘటన తీవ్రంగా కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయంలో రాలేదని, మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందని జగన్ చెప్పారు. విదేశాల్లో ఆక్సిజన్ కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నామని, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఇలాంటివి జరగడం బాధాకరమని జగన్ చెప్పారు.



Next Story