బీజేపీ నేతలు పిచ్చికుక్కలు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
Jadcherla MLA Lakshma Reddy
X

దిశ, జడ్చర్ల: దేశంలో ఎక్కడా లేని దరిద్రమైన ప్రతిపక్షాలు తెలంగాణలో దాపురించాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొంటామని లిఖిత పూర్వకమైన ప్రకటన చేపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. అంతేగాకుండా.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరిధాన్యం కొంటుందో లేదో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పుట్టలేదని, స్వరాష్ట్రం సాధించి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో పుట్టిందని అన్నారు. రైతుల జీవితాలతో ఆడుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ నేతలకు అలవాటే అని అన్నారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా విలువ ఇవ్వకుండా పిచ్చి కుక్క మాదిరి బీజేపీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు.’’ అని విమర్శించారు. ముందు బీజేపీ నేతలు సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుండి లిఖితపూర్వక ప్రకటన చేయించాలని, లేకపోతే నోరు, చెవ్వులు మూసుకుని ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చెర్మెన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జెడ్పీటీసీలు శశిరేఖ బాలుమోహన్ నాయక్, మిడ్జిల్ పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు, జడ్చర్ల మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నియోజకవర్గ రైతుబంధు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed