- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్ గదిలా మార్చుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకునికి ఇటీవల కరోనా సోకింది. ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా… ఒకే గది ఉండడంతో.. శివకు హోమ్ ఐసోలేషన్కు ఇబ్బందిగా మారింది. ఇంట్లోవారికి వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో.. చివరికి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై మంచె కట్టుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం, నీళ్లు కుటుంబ సభ్యులు అందిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రంలో ఎటువంటి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో. వ్యాధి సోకినవారు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఇకనైనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
- Tags
- ome
- ome isolation