- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలల్లో వివిధ సాధారణ, వృత్తి విద్య కోర్సులలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జ్యోతిబాపూలే గురుకుల కళాశాలల జిల్లా కన్వీనర్ భిక్షమయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నల్లగొండ జిల్లాలోని రెండు పాత కళాశాలలు (నాగార్జున సాగర్ బాలురు కళాశాల, మూసి బాలురు కళాశాల) 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన ఆరు పాఠశాలలను (2- బాలురు, 4 బాలికలు) అఫ్ గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాల్లోని విద్యార్థులు ఈనెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలతో పాటు అనేక వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వృత్తి విద్య కోర్సులైన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని తెలిపారు.