జాతీయస్థాయి పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం..

by  |
exam
X

దిశ,నిర్మల్ కల్చరల్: ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ భారతి న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పేరుతో జాతీయస్థాయిలో సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 6నుండి 11వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని, ఈ పరీక్ష దరఖాస్తుకు అక్టోబరు 30 చివరి తేదీ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.vvm.org.in వెబ్ సైటులో సంప్రదించాలని తెలిపారు.


Next Story

Most Viewed