వ్యాక్సినేషన్‌లో భారత్ మరో కీలక మైలురాయి

by  |
వ్యాక్సినేషన్‌లో భారత్ మరో కీలక మైలురాయి
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో కీలక మైలురాయి సాధించింది. వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 75 కోట్ల డోసులకుపైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇలాగే కొనసాగితే డిసెంబర్ నాటికి 43 శాతం దేశ ప్రజలకు వ్యాక్సిన్ పూర్తవుతుందంది. భారత్ చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలోనే కొత్త రికార్డు సృష్టిస్తుందని వెల్లడించింది.

కాగా జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడతల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతూ వస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిని వారందరికీ వ్యాక్సిన్ ఇస్తోంది.


Next Story

Most Viewed