- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే ఎదుట.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో మహిళా కౌలు రైతు తుమ్మల దివ్య స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కొద్ది రోజుల క్రితం తుమ్మల రాఘవేంద్రరావు అనే కౌలు రైతు పొలంలో పనులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో తెలగమళ్ల ఆనందరావు, పార్వతీ దంపతులు మృత్యువాతపడ్డారు. తుమ్మల రాఘవేంద్రరావు కూలీ పనులకు తీసుకెళ్లినందున తాము తమ వారిని కోల్పోవాల్సి వచ్చిందని, వారి పిల్లలు అనాథలుగా మారారని పేర్కొంటూ బంధువులు ఆందోళనకు దిగారు. తుమ్మల రాఘవేంద్రరావు బాధితుల కుటుంబ సభ్యులకు రూ.10లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
అయితే అంత మొత్తం తన వల్ల కాదని, కొంత చెల్లిస్తామని చెప్పి, ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.2లక్షలు చెల్లించారు. అయితే మిగతా మొత్తం ఇవ్వాలని కౌలు రైతుపై మృతుల కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి క్యాంపు ఆఫీస్లో కూడా పంచాయతీ జరిగినట్టు సమాచారం. అయితే సోమవారం తాము పరిహారం చెల్లించలేమని ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఎదుటే రాఘవేంద్రావు సతీమణి దివ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే దివ్యను నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.