- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా సమయంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వాహనం నడుపుతున్నది స్వయంగా ఓ పెళ్ళికొడుకు. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ మండలానికి చెందిన యువకునికి మాగనూరు మండలానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శనివారం తన ఇంటికి వెళ్ళడానికి లాక్డౌన్ నిబంధనలు అడ్డు వచ్చాయి. అద్దె వాహనాలు లేక తమ గ్రామానికి ఎలా వెళ్లాలో తెలియక కొంత ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కూతురుకు సంబంధించిన వాహనం లాక్ డౌన్ కారణంగా ఇంటి దగ్గరే ఉన్న విషయాన్ని గుర్తించారు. వారితో సంప్రదించగా.. వాహనం అయితే ఉంది.
కానీ డ్రైవర్ లేదని చెప్పారు. నేనేం నడుపుతాను అని వాహనదారులను ఒప్పించాడు. శుక్రవారం సాయంత్రం పెళ్లి కూతురు, అతని కుటుంబ సభ్యులను వాహనంలో కూర్చుండబెట్టుకొని తన స్వగ్రామానికి వెళుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది..